కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జండా పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావులు ముఖ్య అతిథులుగా హాజరై టీఆర్ఎస్ పార్టీ జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలైన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనానికి భూమి పూజ చేయడం శుభ పరిణామని, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజా సంక్షేమానికే కట్టుబడి, ప్రజల క్షేమాన్నే కోరుకుంటుంది.
ఇచ్చిన హామీలు నెరవేర్చేటందుకు ఎప్పుడూ సిద్దమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు మందడి సుధాకర్ రెడ్డి స్థానిక నాయకులు ఎలిజాల, అంబటి, బాబా, దేవులపల్లి తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.