ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి
యాదాద్రి, ఏప్రిల్16: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చే పట్టిన ప్రధాన రోడ్డు విస్తరణలో షాపులు, ఇండ్లు కోల్పోతున్న బాధితులకు సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పురపాలిక సంఘం కార్యాలయంలో పాదాల నుంచి యాదగిరిపల్లి వరకు చేపట్టిన రో డ్డు విస్తరణలో స్థలం కోల్పోతున్న బాధితులతో సమావేశమయ్యారు. రింగు రోడ్డు బాధితులకు ఇచ్చిన మాదిరిగానే ప్రభుత్వ ధరకు నాలుగు రెట్లు ఎక్కు వగా నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వ విప్ ఇప్పటికే ము ఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం బాధిత కుటుంబాలకు ఒక షాపు తో పాటు ఇండ్ల స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణకు సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు. పరిహారంపై అధికారులతో మాట్లాడి తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీనిచ్చారు. కార్యక్ర మంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, దండెబోయిన అనిల్, కో ఆప్షన్ సభ్యులు గోర్ల పద్మ, సయ్యద్ బాబా, బాధితులు డాక్టర్ గిరిదర్ తదితరులు పాల్గొన్నారు.
నల్ల చెరువు కాల్వ పనులను త్వరగా పూర్తి చేయాలి..
నల్ల చెరువు ప్రధాన కాల్వ పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయా లని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆదేశించారు. యాదగిరి గుట్ట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ ఏఈ, గుత్తేదార్లతో సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఎంఏయూటీ పథకం ద్వారా మంజూరైన రూ. 20 కోట్ల తో చేపట్టిన పనులపై సమీక్షించారు. ప నుల జాప్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించి పనుల్లో వేగం పెంచాలని, వచ్చే వర్షాకాలం లోపు పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, ఏఈ కొండల్రావు, గుత్తేదారు చాణక్య తదితరులు పాల్గొన్నారు.