రాజన్న సిరిసిల్ల : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రానున్న రెండు, మూడు వారాలు చాలా కీలకమని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్ అన్నారు. ప్రజలు సామూహిక సమావేశాల ప్రాంతాలను సందర్శించకూడదన్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదన్నారు. చందూర్తి ప్రాథమిక వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ పీహెచ్సీ సిబ్బందితో మాట్లాడారు. యాక్టివ్ కేసులు, టీకాలు వేసిన వ్యక్తులు, టీకాలు వేయాల్సిన అవసరం ఉన్నవారి గురించి ఆరా తీశారు.
వైరస్ వ్యాప్తిని తనిఖీ చేసేందుకు జిల్లా యంత్రాంగంతో సహకరించాల్సిందిగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ యొక్క వ్యాప్తి ప్రబలంగా ఉన్నందున, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. ఫేస్ మాస్క్లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. అర్హత ఉన్న వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్, తహసీల్దార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.