గాజులరామారం : యువకుడి హత్య కేసులో జగద్గిరిగుట్ట పోలీసులు సోమవారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జగద్గిరిగుట్ట సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ జిల్లా బేకర్ కట్టకు చెందిన షేక్ ఇమ్రాన్ (22) రింగ్బస్తీలో నివాసం ఉంటూ వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. అయితే జగద్గిరిగుట్ట అజ్బెస్టాస్ కాలనీకి చెందిన షేక్ నవాజ్ (23)తో పాతకక్ష్యలను మనస్సులో పెట్టుకుని ఈ నెల 19న ఇమ్రాన్ తన స్నేహితులు షిర్డిహిల్స్కు చెందిన బిమనపల్లి శ్రీకాంత్ అలియాస్ టెల్లా శ్రీకాంత్ (20), ప్లంబర్ పనులు చేస్తుంటాడు. ఫీరోజ్గూడ గౌతమ్నగర్కు చెందిన ముక్కెర మురళీ (35) ప్రశాంత్నగర్ టెబాకాన్ కంపెనీలో పని చేస్తుంటాడు. వీరితో కలిసి నవాజ్ను శ్రీనివాస్నగర్ బస్స్టాప్కు పిలిపించి ఇమ్రాన్ కత్తితో కడుపులో, ఛాతిపై దారుణంగా పొడిచి పరారయ్యారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. శ్రీకాంత్పై పలు పోలీస్స్టేషన్లలో 15, మురళిపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.