మేడ్చల్ : మేడ్చల్ జిల్లా దుండగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి సారెగూడెంలోని వరుస రెండిళ్లలో నగలు, నగదు అపహరించారు. మరో 3 ఇండ్లలోనూ చోరీ చేసేందుకు యత్నించినా సాధ్యం కాకపోవడంతో పరారయ్యారు. చోరీలకు సంబంధించిన ఆధారాలేవీ లభించుకుండా దుండగులు తెలివిగా ఇళ్లలోని సీసీకెమెరాలను ధ్వంసం చేశారు.
ఉదయం చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఆయా ఇళ్లను పరిశీలించారు. సమీపంలోని సీసీఫుటేజీలను పరిశీలించి ఐదుగురు దొంగలు ఇందులో పాల్పంచుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగాలోకి దిగాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.