మేడ్చల్ : నాగారం మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కొలువైఉన్న శ్రీ రమా సత్యనారాయణ స్వామి, శ్రీ షిర్డి సాయిబాబా, శ్రీ అభంజనేయ స్వామి, శ్రీ పోచమ్మ ఆలయాల 13వ వార్షికోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. అర్చకులు మొదటి రోజు స్వామి వార్లకు విశేష అభిషేకములు, అర్చనలు నిర్వహించారు. సాయిధామం గురూజీ శ్రీశ్రీశ్రీ స్వామి శ్రీ రామానంద ప్రభూజీ ఆలయానికి విచ్చేసి ధ్వజారోహణం నిర్వహించిన అనంతరం భక్తులకు సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా స్వామి వార్లను మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చందారెడ్డి, ఆలయ చైర్మన్ అన్నంరాజు శ్రీనివాస్లు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నంరాజు లావణ్య, ఆలయ అధ్యక్షులు నిరంజన్ బాబు, సభ్యులు వెంకటేశ్వర్ రావు, శ్రీనివాస్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.