ఉప్పల్, మే 14: హబ్సిగూడ స్ట్రీట్ నం.8 ఎస్ఎస్నగర్లోని శ్రీకోదండ రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరామలింగేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు యాదవరెడ్డి, రాజిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, దామోదర్రెడ్డి, సుధాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, మల్లారెడ్డి, అజిత్రెడ్డి, ప్రదీప్రెడ్డి, భాను, స్వామి, సిద్ధేశ్వర్, సందీప్రెడ్డి పాల్గొన్నారు.
హబ్సిగూడలోని శ్రీకోదండ రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో చేపట్టిన విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్రెడ్డి, సుధాకర్రెడ్డి, కిశోర్, అనిల్కుమార్, మురళీకృష్ణారెడ్డి, రామకృష్ణ, భాస్కర్ పాల్గొన్నారు.