ఖమ్మం, ఏప్రిల్ 30: నగరపాలక సంస్థ పరిధిలో శుక్రవారం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకుడు ఆహ్మద్ నదీమ్ ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి పరిశీలించారు. ఖానాపురం కరెంట్ ఆఫీస్ పోలింగ్ కేంద్రంతో మొదలుకొని ఇందిరానగర్, కొత్తగూడెంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కొవిడ్ నిబంధనలు అమలవుతున్న తీరుపై ఎన్నికల అధికారులను ఆరా తీశారు. కలెక్టరేట్లో వెబ్కాస్టింగ్ను పరిశీలించారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను సందర్శించారు. బ్యాలెట్ బాక్సుల భద్రతపై సిబ్బందికి సలహాలు, సూచనలిచ్చారు. వారి వెంట నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్రావు ఉన్నారు.