మేడ్చల్ మల్కాజిగిరి : తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ప్రజలందరు గుర్తించారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని 3వ డివిజన్లో కార్పొరేటర్ బల్లి రోజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం డివిజన్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇతర పార్టీలపై ప్రజల్లో విశ్వాసం పోయిందని, ప్రజల సూచనల మేరకు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లోని టీఆర్ఎస్ డివిజన్ కమిటీల ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లను తిడితే ఊరుకోబోమని, తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. రూ. 50 కోట్లతో పీసీసీ పదవి పదవిని కొనుకున్నాడని రేవంత్రెడ్డిపై సంచలన ఆరోపణ చేశారు. జైలుకెళ్లిన దగుల్బాబీ అని మండిపడ్డారు.
కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటి మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
వేణు, పల్లపు రవి, పానుగంటి బాబు, కోఆప్షన్ మెంబర్లు, కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ముదిరాజ్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగన్న బాల్రాజ్, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.