మేడ్చల్ : సంచార జాతులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర సంక్షేమాభివృద్ధి కమిటీ సభ్యుడు తుర్క నరసింహ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీఆర్వో లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు జిల్లా ఎస్సీ,ఎస్టీ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.