శామీర్పేట మండలం అంతాయిపల్లిలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూలై చివరి వారం వరకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. భవనం సమీపంలో మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్వాంసన్, డీఎఫ్వో వెంకటేశ్వర్లు, ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాసమూర్తి తదితరులు ఉన్నారు.