మేడ్చల్, జూన్ 5(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ధరణి పోర్ట్లో పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మేడ్చల్ జిల్లాకు సంబంధించిన పలు ఆంశాలపై కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడారు. భూములకు సంబంధించిన దరఖాస్తులు, పెండింగ్ మ్యుటేషన్లు అన్ని రకాల దరఖాస్తులను ప్రభుత్వం సూచించిన మేరకు ఈ నెల 9వ తేదీలోగా పరిష్కరిస్తామని తెలిపారు.
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణా పనులు తుది దశకు చేరాయని, మిగిలిన పనులు పూర్తి చేసేందుకు తానే స్వయంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని సీఎస్కు వివరించారు. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు భూమిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రాసెసింగ్ నిర్మాణాల వల్ల చాలా మందికి ఉపాధి లభించడమే కాకుండా రైతులు పండించిన పంటలకు మంచి ధర వస్తుందని, దీనిని అత్యంత ప్రాధాన్యతగా గుర్తించాలని సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్ శ్వేతా మహంతికి ఆదేశించారు. కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహారెడ్డి, శ్యాంసన్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.