మేడ్చల్ మల్కాజ్గిరి : పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్పై సస్పెన్షన్ వేటు పడింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలం అలియాబాద్ గ్రామ సర్పంచ్ గుర్క కుమార్ గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. గ్రామపంచాయతీ పరిపాలనలో అధికార దుర్వినియోగంతో పాటు ప్రభుత్వం అందచేసిన నిధులను కూడా పక్కదారి పట్టించారని పలువురు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి ఫిర్యాదు చేశారు. దీంతో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టగా అక్రమాలు జరిగినట్లు తేలింది. వెంటనే గ్రామ సర్పంచ్పై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.