శంషాబాద్ రూరల్, జూలై 24 : మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శనివారం మండలంలోని ముచ్చింతల్ గ్రామంలో మహిళలు నిర్వహిస్తున్న పట్టు పరిశ్రమను సందర్శించారు. మహిళలు పట్టు పరిశ్రమ తయారు చేయడం కోసం వారు తీసుకుంటున్న చర్యలను అగిడి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధిని ఎంచుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం ముచ్చింతల్ గ్రామంలోని పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. పెద్దతూప్ర గ్రామలంలో పర్యటించి పల్లెప్రకృతివనం, నర్సరీ తదితర వాటిని పరిశీలించారు. గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఆయనతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్జైన్, రంగారెడ్డి జిల్లా సీఈవో దిలీప్కుమార్, డీఆర్డీవో ప్రభాకర్, ఎంపీడీవో వినయ్కుమార్, ఎంపీవో సురేందర్రెడ్డి, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, సర్పంచ్లు వెంకటయ్య, సుజాత, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.