మల్కాజిగిరి: ఆనంద్బాగ్ లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణ అధికారి ఎల్. భాగ్యలక్ష్మి సమక్షంలో 52 రోజులకు గాను భక్తులు స్వామివారి హుండీలో వేసిన కానుకలు లెక్కించగా 3,57,966 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ముడుంబై వేంకటరమణాచార్యులు, అర్చకులు తులసి రమణాచార్యులు, క్లర్క్ సండ్ర సుధాకర్, మాజీ చైర్మన్లు ఉమేష్సింగ్, సంతోష్, మాజీ ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.