రామంతాపూర్ : రామంతాపూర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవ సంఘ భవన్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి స్వామివారికి అభిషేకం, అర్చనలు చేశారు. అనంతరం గోమాత పూజ , ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. సంఘం నాయకులు సర్వబాబు యాదవ్ సర్వసత్తయ్య యాదవ్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ యాదవ కులదైవమైన కృష్ణభగవానుని జన్మదినం ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రతీ సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.