ఘట్కేసర్: హరితహరంలో నాటిన మొక్కలు పచ్చదనాన్ని పంచుతూ పాఠశాలలో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అంతేకాదు అటుగా వెళుతున్న వారిని సైతం ఆకట్టుకుంటున్నాయి. పోచారం మున్సిపాలిటీ వరంగల్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అన్నోజిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం నిర్వహించిన పలు ధఫాల హరితహరం కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు నాటి మొక్కలు నేడు పచ్చదనాన్ని పంచుతూ, రోడ్డు పై వచ్చిపోయే బస్సు ప్రయాణికుల, వాహనదారుల దుష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రధానోపాధ్యాయుడు గౌరి శంకర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలో ఉన్న కొద్దిపాటి ఆవరణలో పూలు, పండ్లు, నీడ నిచ్చే మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. పాఠశాల కొనసాగిని సమయంలో ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్ధులు చెట్లకు నీరు పోసి సంరక్షించారు. కరోన కారణంగా విద్యార్థులు పాఠశాలకు రాకపోయినా, ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలకు నీటిని అందిస్తూ, కాపాడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ మొక్కలు పచ్చగా, ఏపుగా పెరుగుతూ, పాఠశాలకు అందాన్ని తెచ్చిపెడుతూ, నీడనిస్తున్నాయి.