కేశంపేట, ఏప్రిల్ 20 : ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకుని నూరేండ్లు ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ ప్రత్యేక పూజ చేశారు. దేవునిగుడితండా పరిధిలోని రాగ్యతండాలో మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని గిరిజన సంప్రదాయం ప్రకారం వేంకటేశ్వరస్వామి, సేవాలాల్ మహారాజ్, హతిరామ్ భావాజీ, బడియా బాపు, ఆంజనేయస్వామికి గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంగోత్ శంకర్నాయక్, గిరిజన సంఘం నాయకులు ఎ.శంకర్నాయక్, సంజునాయక్ పాల్గొన్నారు.
దర్గాలో ప్రత్యేక పూజలు
కొత్తూరు. ఏప్రిల్ 20 : సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే జనిగె జగన్ జహంగీర్ పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దర్గాలో ప్రార్థనలు చేశానని వివరించారు.
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి
కడ్తాల్ ఏప్రిల్ 20 : సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ మండలంలోని మైసిగండి మైసమ్మతల్లికి, జడ్పీటీసీ దశరథ్నాయక్ ఆధ్వర్యంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్లు తులసీరాంనాయక్, హరిచంద్నాయక్, సులోచన, యాదయ్య, ఎంపీటీసీలు గోపాల్, లచ్చిరాంనాయక్, మంజుల, ప్రియ, పీఏసీఎస్ డైరెక్టర్లు వీరయ్య, సేవ్యానాయక్, వెంకట్యాదవ్, వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్లు వినోద్, నరేశ్, గణేశ్, నాయకులు సాయిలు, చంద్రమౌళి, అంజి, భీక్యానాయక్, జగన్ పాల్గొన్నారు.