జవహర్నగర్ : పట్టణంలోని ప్రజలందరూ సేదాతీరే విధంగా బృహత్ ప్రకృతి ప్రణాళికను ఏర్పాటు చేశామని మేయర్ మేకల కావ్య అన్నారు. ఐదెకరాల విస్తీర్ణంతో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనంలో శనివారం ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. జవహర్నగర్ కార్పొరేషన్లో పచ్చదనమే లక్ష్యంగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించే బాధ్యత మనందరిపై ఉందని మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.