మేడ్చల్ : అర్బన్ పార్కుల్లో శ్రీగంధ సువాసనలు పరిమళించనున్నాయి. జిల్లా అంతటా ఉన్న అర్బన్ పార్కులు, రిజర్వు ఫారెస్ట్ల్లో అంతరించిపోతున్న ఈ జాతి మొక్కలను విరివిగా పెంచాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. బహుళ ప్రయోజనాల దృష్ట్యా అధికారులు శ్రీగంధం మొక్కల పెంపకానికి సన్నద్ధమయ్యారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయ ఆక్సిజన్ పార్కు నుంచి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. మొదటగా దూలపల్లి అటవీశాఖ రేంజ్ పరిధిలోని మొక్కల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాత జిల్లా అంతటా చేపట్టాలని అధికారులు సంకల్పించారు. శ్రీగంధం మొక్కతో బహుళ ప్రయోజనాలు ఉన్నా యి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాం తాల్లో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కుల్లో పెద్ద ఎత్తున మొక్కలను పెంచి, అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఒక్కో పార్కు వేల మొక్కలతో అలరారుతోంది. అయి తే, అటవీ ప్రాంతాన్ని మరింత దట్టమైన (డెన్స్) ప్రాంతంగా మలచడానికి శ్రీగంధం మొక్కలు ఉపయోగపడుతాయని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా వృక్షాల నీడలో ఏ మొక్క ఎదగదు. అంతేగాక భూమిలో ఉన్న ఇతర చెట్ల వేర్లు కూడా మొక్క బతకడానికి సహకరించవు. కానీ, శ్రీగంధం మొక్క నీడలో భూమిలో ఉన్న ఇతర చెట్ల వేళ్ల ఆధారంగా నిటారుగా ఎదుగుతుంది. పర్యావరణ హితం చేకూర్చే వివిధ రకాల పక్షులు, క్రిమి, కిటీకాలు ఎదిగేందుకు ఆలవాలంగా మారి, జీవ వైవిధ్యానికి దోహ దం చేస్తుంది. అంతేకాదు ఇది భూమిపై ఉన్న అన్ని కలపల్లో కంటే ఖరీదైన కలప. అర్బన్ పార్కుల్లో శ్రీగంధం మొక్కల సాగులో ప్రతిరోజు అధికారుల పర్యవేక్షణ ఉండటంతో 90 శాతం కంటే ఎక్కువ మొక్కలు బతికించుకోవచ్చు. దూలపల్లి అటవీ శాఖ రేంజ్లో ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో రెండువేలు, ఆయూష్, ప్రశాంతి వనా ల్లో కలిపి మరో ఆరువేలు, 14 రిజర్వు ఫారెస్ట్ల్లో కలి పి 20 వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్ర పంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న అటవీ కళాశాల విద్యార్థులతో కలిసి పీసీసీఎఫ్ శోభ మొక్కలు నాటి, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఉన్న అన్ని అర్బన్ పార్కు లో శ్రీగంధం మొక్కలు పెంపకానికి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
శ్రీగంధం పెంపకానికి సన్నద్ధం
కండ్లకోయ ఆక్సిజన్ పార్కు లో శ్రీగంధం పెంపకానికి సన్నద్ధమవుతున్నాం. ఇప్పటికే కొన్ని మొక్కలను కొనుగోలు చేసి నా టాం. వర్షాకాలం నాటికి పూర్తి స్థాయిలో నాటడానికి అవసరమై న మొక్కలను మేం నర్సరీలో సి ద్ధం చేసుకుంటున్నాం. నాలుగు చెట్లకు ఒకటి చొప్పు న దాదాపు రెండు వేల మొక్కలను నాటాలని నిర్ణయించాం.- శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, మేడ్చల్