మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరనం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా విశాల్ మెగా మార్ట్ ఎదుట శుక్రవారం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు…హోండా ఆక్టీవాపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.