శామీర్పేట : (Huzurabad) విద్యార్థి సంఘ నాయకుడు, ఉద్యమకారుడికి హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి టికెట్ ఇవ్వడం హర్షనీయమని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి విద్యార్థులు, ఉద్యమకారులు పట్ల తనకున్న ప్రేమను మరొకసారి చాటుకున్నారని తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి కేవలం కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నమ్ముకున్నందుకు ఈ రోజు దక్కిన గౌరవం అన్నారు.
హుజూరాబాద్ లో రెండు వేల ఎకరాల అహంకారికి రెండు గుంటలు భూమిలేని నికార్సైన ఉద్యమకారుడికి జరుగుతున్నటువంటి పోటీలో ప్రజలందరూ గులాబీ జెండా ఎగురవేస్తారని పేర్కొన్నారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ టికెట్ కేటాయించడం పట్ల యువకులు, ఉద్యమకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రామిడి మధుకర్రెడ్డి తెలిపారు.