చర్లపల్లి, ఆగస్టు : నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరమ్మ గృహ కల్ప వద్ద ప్రభుత్వ స్థలంలోని కంచెను తొలగించిన వారిపై చర్యలు తీసుకొవాలని కొరుతూ కాలనీవాసులు మంగళవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిర గృహ కల్ప కాలనీలోని ప్రభుత్వ స్థలంలో వేసిన కంచెను తొలగించిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకొవాలని సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు.
పలు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి కంచెలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.అదేవిధంగా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు రోశయ్యగౌడ్, బత్తిని భాస్కర్గౌడ్, మాజీ అధ్యక్షుడు ముత్యాలు, సాగర్గౌడ్, వెంకన్న, మోహన్కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు ఎంపెల్లి పద్మారెడ్డి, డప్పు గిరిబాబు, జాండ్ల ప్రభాకర్రెడ్డి, బొడిగె రాజుగౌడ్, శ్రీధర్, బాల్రాజు తదితరులు పాల్గొన్నారు