మేడ్చల్, జూలై 5: హరితహారంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని సీఎం ఓఎస్డీ, హరితహారం ఇన్చార్జి ప్రియాంక వర్గీస్ అన్నారు. సోమవారం మేడ్చల్ మున్సిపాలిటీలో పర్యటించిన ఆమె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు ఉపయోగ పడే పండ్ల, మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే మునగ, కరివేపాకు లాంటి మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నర్సింహారెడ్డి, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.