జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో గల ముక్తేశ్వర లాడ్జిలో కొండు శ్రీనివాస్ (55) అనే సింగరేణి కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి గదిలో తన చావుకు అమర్నాథ్ వ్యక్తి కారణమని సూసైడ్ నోట్ రాసి ఉంది. బంధువులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. మృతుడు శ్రీనివాస్ గత నాలుగు సంవత్సరాలుగా భూపాలపల్లి కేటీకే 6వ గణిలో సర్దార్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
దీనిలో బాగంగా తన కుమారుడికి ఉద్యోగం పెట్టించాలనే ఆలోచనతో తనను మెడికల్ ఆన్ ఫిట్ చేయాలని అమర్నాథ్ అనే వ్యక్తిని రెండు సంవత్సరాల క్రితం కలువగా అమర్నాథ్ రూ. 6లక్షల 50వేలు ఇస్తే మెడికల్ ఆన్ ఫిట్ చెపిస్తానని చెప్పాడు.
దీంతో రెండేండ్ల క్రితమే డబ్బులు మొత్తం అప్పజెప్పాడు. డబ్బులు తీసుకున్న అమర్నాథ్ శ్రీనివాస్ ను డ్యూటీకి వెళ్లకుండా ఉండాలనడంతో రెండు సంవత్సరాలు శ్రీనివాస్ విధులకు గైర్హాజరయ్యాడు.
అయినప్పటికీ శ్రీనివాస్ ను ఆన్ ఫిట్ చెయ్యక పోవడంతో ఏప్రిల్ 19వ తేదీ నుంచి జిల్లా కేంద్రంలోని ముక్తీశ్వర లాడ్జిలో ఓ గదిలో ఉంటూ మళ్లీ విధులకు హాజరవుతున్నాడు.
దీంతో అమర్నాథ్ తన దగ్గర డబ్బులు తీసుకొని మెడికల్ ఆన్ ఫిట్ చెయ్యకుండా తనను మోసం చేశాడని మనస్తాపం చెంది ఆదివారం ఉదయం తను ఉండే గదిలోనే ఉరివేసుకొని మృతి చెందాడు.
మృతుడి స్వస్థలం మంచిర్యాల లోని సీసీ నస్తూరు కాలనీ. మృతునిడి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అభినవ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
ఖమ్మం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం : ఎమ్మెల్సీ వాణీదేవి