నేరేడ్మెట్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ బోనాల జాతరను ఆదివారం నేరేడ్మెట్ పరిధిలోని మల్కాజిగిరి కోర్టు ఆవరణ ఉన్న అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. మల్కాజిగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండేలా చూడాలంటూ అమ్మవారిని వేడు కున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేంకుమార్, స్వర్ణరాజ్, మల్కాజిగిరి టీఆర్ఎస్ నాయకులు సతీష్కుమార్, రాముయాదవ్, ఎస్ఆర్ ప్రసాద్, మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.