పీర్జాదిగూడ, ఆగస్టు : ప్రైవేటుపాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతున్నదని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. ఈ మేరుకు శుక్రవారం నగరపాలక పరిధి పర్వతాపూర్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏవీ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధుల ఆధ్వర్యంలో ముద్రించిన నోటు పుస్తకాలను మేయర్ జక్క వెంకట్రెడ్డి కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, బొడిగ స్వాతికృష్ణగౌడ్, కౌడె పోచయ్య, కో ఆప్షన్ సభ్యులు రాందాస్గౌడ్, జగదీశ్వర్రెడ్డి, నాయకులు బండి సతీష్గౌడ్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.