మేడ్చల్, మే 17 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. దళారుల బారిన పడకుండా మద్దతు ధర చెల్లిస్తూ కరోనా కష్టకాలంలో వారికి అండగా ఉంటున్నది. మేడ్చల్ జిల్లావ్యాప్తంగా 12 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 980 మంది రైతుల నుంచి 9,200 మెట్రిక్ టన్నుల ధ్యానాన్ని కొనుగోలు చేసి రూ.10.10 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. యాసంగి వరి కోతలు చివరిదశకు చేరుకున్నాయని, జూన్ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.