డీసీఎంఎస్ వైస్చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి
అలియాబాద్లో ధాన్యం కొనుగోలు కేంద్రం సబ్సెంటర్ ప్రారంభం
శామీర్పేట, మే 8: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి అన్నారు. శామీర్పేట మండలంలోని అలియాబాద్ జడ్పీహెచ్ఎస్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రం సబ్సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా సమయంలో కూడా రాష్ట్రంలో భారీగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండాలని మద్దతు ధర కేటాయించి అవసరం ఉన్న ప్రతి చోట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోరిక మేరకు అలియాబాద్ జడ్పీ ఉన్నత పాఠశాలలో సబ్సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అమ్ముకోవచ్చన్నారు.కార్యక్రమంలో సర్పంచ్ కుమార్యాదవ్, రైతుబంధు కన్వీనర్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్యాదవ్, డైరెక్టర్ నరేందర్రెడ్డి, ఉపసర్పంచ్ ప్రభాకర్రెడ్డి, మాజీ డైరెక్టర్లు నాగమల్లారెడ్డి, నరేశ్గౌడ్, రైతులు రాఘవరెడ్డి, బాలేశ్ పాల్గొన్నారు.