మేడ్చల్ : కల్లు తాగడానికి వెళ్లిన ఓ వ్యక్తి హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ ప్రవీణ్రెడ్డి తెలియజేసిన వివరాల ప్రకారం.. దుందిగల్ మండలం, నాగలూరు గ్రామానికి చెందిన మాసని సత్యనారాయణ (45) వ్యవసాయం చేస్తుంటాడు. నెల రోజుల క్రితం కొంత భూమిని అమ్మగా , ఆ విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య నాగమణి పుట్టింటికి వెళ్లింది. భూమి అమ్మగా వచ్చిన డబ్బులతో మేడ్చల్ మండలం రాయిలాపూర్కు వచ్చి రోజూ కల్లుతాగి వెళ్లేవాడు. అదే క్రమంలో బుధవారం రాత్రి 8 గంటలకు రాయిలాపూర్కు వెళ్లిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు. గురువారం ఉదయం అతడి కుటుంబ సభ్యులు గాలిస్తుండగా గ్రామ శివారులో రోడ్డు పక్కన గుంతలో పడి మృతి చెంది ఉన్నాడు. దుస్తులపై రక్తం మరకలు ఉన్నాయి. బుధవారం రాత్రి అతడి వెంట కల్లు తాగడానికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కూడా వెళ్లాడని, అతనే ఈ హత్య చేసి ఉంటాడనే అనుమానం తమకు ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.