మేడ్చల్ కలెక్టరేట్ : హరితహారానికి 10 శాతం నిధులు కేటాయించాలని మేడ్చల్ అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. శుక్రవారం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కార్యాలయాల్లో జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయాల్లో మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణిత బడ్జెట్ను ప్రవేశపెట్టగా కౌన్సిలర్లు ఆమోదించారు.
నాగారం మున్సిపాలిటీ మొత్తం అంచనా ఆదాయం రూ.3016.37 లక్షలు, ప్రారంభ నిలువను కలుపుకొని మొత్తం రూ.4088.61 లక్షలు, అంచనా వ్యయం రూ.3692.52 లక్షలు, మిగులు బడ్జెట్ రూ.396.09 లక్షలతో బడ్జెట్కు ఆమోదం తెలిపారు.
దమ్మాయిగూడ మున్సిపాలిటీ మొత్తం అంచనా ఆదాయం రూ.2092.85 లక్షలు, ప్రారంభ నిలువను కలుపుకొని రూ.2818.16 లక్షలు, అంచనా వ్యయం రూ.2065.20 లక్షలు, మిగులు బడ్జెట్ రూ.753.61 లక్షలతో బడ్జెకు ఆమోదం తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో మున్సిపల్ కమిషనర్లు వాణి, స్వామి, వైస్ చైర్మన్లు, కౌన్సిలరు,్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జవహర్నగర్, ఏప్రిల్ 09 : జవహర్నగర్ కార్పొరేషన్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి గానూ వార్షిక బడ్జెట్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశాన్ని జవహర్నగర్లో కార్పొరేషన్లో మేడ్చల్ అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అధ్యక్షతన నిర్వహించగా మేయర్ మేకల కావ్య బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కార్పొరేషన్కు చెందిన మొత్తం రూ.34 కోట్ల ఆదాయం నుంచి 10 శాతం అంటే రూ.34 లక్షల నిధులను గ్రీన్ బడ్జెట్కు కేటాయించారు. మిగిలిన బడ్జెట్ను జీతాభత్యాలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, పారిశుధ్య నిర్వహణ, కరెంటు బిల్లుల కేటాయింపులకు ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ గోపి, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
శామీర్పేట, ఏప్రిల్ 9 : తూంకుంట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని మేడ్చల్ అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ అన్నారు. శుక్రవారం తూంకుంట మున్సిపాలిటీలో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. తూంకుంట మున్సిపాలిటీ 2021-22 సంవత్సరానికి అంచనా ఆధాయ వ్యాయాలను రూ.27 కోట్ల 22 లక్షల 50వేలుగా బడ్జెట్ను రూపొందించినట్లు వివరించారు. బడ్జెట్లో 10 శాతాన్ని పచ్చదనం కోసం, జాతీలు, పారిశుధ్యం, విద్యుత్ చార్జీల చెల్లింపులతో పాటు వార్డు వారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు, వైస్ చైర్మన్ వాణీవీరారెడ్డి, కమిషనర్ గంగాధర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మేనేజర్ శ్రవణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.