మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 21 : మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రతి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు గణేశ్నగర్ కాలనీలో రూ.6లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను సోమవారం చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ఉన్న ప్రతికాలనీకి గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ.వాణిరెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్ లక్ష్మి, నాయకులు దయాకర్ రావు, కాలనీప్రజలు తదితరులు పాల్గొన్నారు.