మేడ్చల్ కలెక్టరేట్, మే 26: రాబోయే వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురి కాకుండా ముందస్తుగా నాలాల్లో పూడికతీత పనులు చేపడుతామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని సాయి సంజీవనగర్ కాలనీ, బీబీసీ కాలనీ, రాంపల్లిలోని సూర్యనారాయణ చెరువు కింద ఉన్న ఎరిమెల వాగును పరిశీలించారు. అనంతరం చంద్రారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని వాగులోని చెట్లు, పూడికను తీసి వాగుకు ఇరు పక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలు మునగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ. వాణిరెడ్డి, కౌన్సిలర్లు హరిబాబు, నగేశ్గౌడ్, సరిత, లక్ష్మి, కళావతి, అధికారులు పాల్గొన్నారు.