కుత్బుల్లాపూర్, మే 23: కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు నిత్యం చౌరస్తాల వద్ద విధులు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా.. మరే సమస్యలు ఉన్నా.. కాస్తంతా ఉపశమనం తీసుకోవాలన్నా వారి బాధలు వర్ణాణాతీతం.. దీంతో పోలీసుల సేవలు, బాధలు గుర్తించిన దూలపల్లి పారిశ్రామికవాడకు చెందిన ఓ వ్యక్తి.. వారి కోసం మొబైల్ హౌస్ షెల్టర్ను తయారు చేసి ఇచ్చాడు. దాన్ని సుచిత్ర చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులకు రక్షణతో పాటు ఉపశమం ఇచ్చేలా సకల వసతులు ఇందులో కల్పించారు. దీంతో పోలీసులు అతడిని అభినందిస్తున్నారు.