మేడ్చల్ మల్కాజిగిరి : కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్వీ కార్యకర్త రవికిరణ్ రూపొందించిన ఆంగ్ల సంవత్సరాది 2022 క్యాలెండర్ను రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆదివారం ఆవిష్కరించారు. అలాగే మరొక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ రవికిరణ్ రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నూతన సంవత్సరంలో అందరికి మంచి జరుగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో 125 డివిజన్ కార్పొరేటర్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు డి విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు అముర ఇంద్రసేన గుప్తా, వార్డ్ మెంబర్ అజయ్ ప్రసాద్ గుప్తా, సుంకరి శివ ముదిరాజ్, కేబుల్ విజయ్, శంకర్, సుమన్, సన్నీ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.