కుత్బుల్లాపూర్, మార్చి9 : సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూ సి ఓటెయ్యండి.. అభివృద్ధి చేసే టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలం టూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజిగిరి పార్లమెంట్ ని యోజకవర్గ పార్టీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్లో జరిగిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ట్రస్మా సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో బడ్జెట్ పాఠశాలలో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వీటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. రాబోయే రోజుల్లో బడ్జెట్ పాఠశాలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ నెల 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలో సీఎం కేసీఆర్ బలపర్చిన సురభి వాణీదేవికి తమ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
కొంపల్లి మున్సిపాలిటి పరిధిలోని దూలపల్లిలో ఆయా వార్డుల్లో కౌన్సిలర్ డప్పు కిరణ్కుమార్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్లను నేరుగా కలిసి సురభి వాణీదేవికి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేపట్టారు.
బడ్జెట్ పాఠశాలలో లాక్డౌన్ సమయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ సముఖంగా ఉన్నట్లు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. లాక్డౌన్ సమయంలో స్కూల్స్కు విధించిన ప్రాపర్టీ టాక్స్తో పాటు ఇతర సమస్యలపై ఇటీవలే ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావుతో చర్చించామని, దీనిపై సీఎం కేసీఆర్ సమాలోచన చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ప్రతి రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంటుందన్నారు. బడ్జెట్ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్కే సాధ్యమౌతుందని, అందుకు ఈ నెల 14న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో సురభి వాణీదేవీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ స్ఫోక్ పర్సన్ శ్రీధర్రెడ్డి, ట్రస్మా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చింతల రామచందర్, చైర్మన్ పి.శివయ్య, చింతల మల్లేశం, సలహాదారులు శ్రీనివాస్గౌడ్, సత్యారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, దయాకర్, సీహెచ్. మహేశ్, రామిరెడ్డి, ఆయా బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.