రామంతాపూర్, సెప్టెంబర్ 19 : ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. శంకర్ రూ.60 వేలు, ఈశ్వరత్బేగం రూ.60వేలు, రఘనాథ్ రూ.38వేలు, శరత్బాబు రూ.27 వేలు చెక్కులను ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యే శ్రద్ధ చూపిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు జనుపంల్లి వెంకటేశ్వర్రెడ్డి, ఎండీ ముస్తాక్, గంగిడి కృష్ణారెడ్డి, సూరం శంకర్, రవీందర్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, ఎర్రం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.