నేరేడ్మెట్, సెప్టెంబర్ 23 : మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నియోజకవర్గంలో మంచినీటి, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నానని అన్నారు. గురువారం శ్రీ ఎన్క్లేవ్ కాలనీలో మంచినీటి పైపులైన్ల పనులను స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వివిధ శాఖల అధికారు లతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంచినీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. వరదముప్పు సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పిం చేందుకు కోట్లాది రూపాయలతో నియెజకవర్గంలో డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తున్నామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మీ కాలనీలో ఎలాంటి సమస్యలున్నా స్థానిక కార్పొరేటర్ దృష్టికి తెస్తే..వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని అన్నారు. కార్యక్రమంలో వాటర్బోర్డు జీఎం సునీల్ కుమార్, ఏఈ సృజన, జీఎన్వీ సతీశ్కుమార్, నిరంజన్, మోటె సాయి కుమార్, రాంరెడ్డి, జీవగన్, శివ కుమార్, చెన్నారెడ్డి, గోకుల్, రమేశ్, మోహన్, యాది, మహేశ్, రాజు, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
వినాయక్నగర్, సెప్టెంబర్ 23: రోడ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మం తరావు అన్నారు. గురువారం అల్వాల్ డివిజన్ లోతు కుంట నుంచి వెంకటాపురం వరకు రూ.1.30కోట్లతో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుంతలు పడిన రోడ్లతో స్థానికులు ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. అధికారులతో సర్వే నిర్వహించి అవస రమైన కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడతా మన్నారు.
ఇప్పటికే సర్కిల్ పరిధిలోని మెయిన్ రోడ్లలో వైట్ టాపింగ్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తిచేశామన్నారు. అవసరమైన రోడ్లలో వైట్ టాపింగ్ రోడ్లు వేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ నాగమణి, కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, సర్కిల్ అధ్యక్షుడు కొండల్రెడ్డి, కార్యదర్శి బలవంత్ రెడ్డి, నాగేశ్వరావు, ఆనంద్, ఉదయ్కుమార్, శేఖర్గౌడ్, శ్రీనివాస్గౌడ్, లక్ష్మణ్రావు, సూర్య, జ్యోతి, కవిత, నిర్మల, బబిత, కామేశ్వరి, సరోజ, గాయత్రి, ప్రేమ్, శ్రీశైలం, సూర్యకిరణ్, ప్రవీణ్, లోకేశ్, సతీశ్, అరవింద్ పాల్గొన్నారు.