గౌతంనగర్/అల్వాల్/వినాయక్నగర్/నేరేడ్మెట్/ మల్కాజిగిరి, ఏప్రిల్11 మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు పరిపాలన చేపట్టారని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతంనగర్ చౌరస్తాలో కార్పొరేటర్ మేకల సునీతరాముయాదవ్ సొంత నిధులతో నిర్మించిన జ్యోతిరావు ఫూలే , సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్నగర్లోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేసిన గొప్ప దంపతులని కొనియాడారు. కార్పొరేటర్ ప్రేమ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం, శ్రావణ్, సాయిలు, విష్ణు, ఆతిక్ పాషా, రమేశ్, సుదర్శన్, సహదేవ్, కొండల్ రెడ్డి, సరిత, సులోచన తదితరులు పాల్గొన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ కానాజీగూడ తిరుమల సిటీ అనాథ ఆశ్రమంలో మహాత్మా జ్యోతిరావు ఫూ లే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కార్పొరేటర్ సబితాకిశోర్ పూలమాలవేసి నివాళులర్పించి కేక్ కట్చేశారు. వినాయక్నగర్లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి, మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ పాల్గొన్నారు.
జ్యోతిరావు ఫూలే సామాజిక విప్లవకారుడని, గాంధీజీకి స్పూర్తినిచ్చిన నిజమైన మహాత్ముడని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. ఆదివారం సైనిక్పురి చౌరస్తాలో జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డితో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్రావు కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా సోమశేఖర్ రెడ్డి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్, మీర్పేట్ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ కొత్తరామారావు, మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి, రావుల అం జయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రొగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ మేడ్చల్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రాథమిక పాఠశాలలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, సభ్యులు పాల్గొన్నారు.