గౌతంనగర్, ఏప్రిల్10 అన్నివర్గాల ప్రజలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం గౌతంనగర్ డివిజన్ పరిధి మిర్జాల్గూడలో మల్కాజిగిరి మున్నూరు కాపు సంఘం సమావేశం నిర్వహించారు. మున్నూరు కాపు సంఘం సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. సంఘం కోసం కమ్యూనిటీహల్ నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ భవనాలు నిర్మించారని, మున్నూరు కాపు సంఘం కోసం కమ్యూనిటీహల్ ఏర్పాటుకు తనవంతుగా కృషిచేస్తామని అన్నారు. కుల సంఘాలు ఐక్యతతో ఉండాలని అన్నారు.