గౌతంనగర్, సెప్టెంబర్ 17 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం గౌతంనగర్ డివిజన్, జ్యోతినగర్లో రూ.30లక్షల నిధులతో చేపట్టే రోడ్డు పనులను ఎమ్మెల్యే .. కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జ్యోతినగర్లో చేపట్టిన బాక్స్ డ్రైన్ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు ముంపు కు గురికాకుండా ముందస్తుగా జ్యోతినగర్, మిర్జాల్ గూడ లో బాక్స్ డ్రైన్ పనులను చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్ పాల్గొన్నారు.