వినాయక్నగర్, ఆగస్టు2: కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం మచ్చబొల్లారం ఓల్డ్ అల్వాల్ డివిజన్ శ్రీలక్ష్మీనగర్ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు కాలనీలో తాగునీటి పైపులైన్, డ్రైనేజీ, పవర్ బోరు, కాలనీ ముఖద్వారం ఏర్పాటుచేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కరించడానికి డీజీఎంకు ఫోన్చేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. డ్రైనేజీ, పవర్ బోరుతో పాటు కాలనీ ముఖద్వారాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభిస్తామని, స్థానికులు అధికారులకు సహకరించాలని కోరారు.కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నాగేశ్వర రావు, ఉపాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, కార్యదర్శి శ్రీకాంతరావు, కోశాధికారి నారాయణ, రామకృష్ణ, బాపురెడ్డి, లింగారెడ్డి, జైపాల్రెడ్డి, భాస్కర్గౌడ్, శావరాజ్, శివశరణప్ప,ఆంథోని, ఆర్.నాగేశ్వరరావు, మనోహర్రావు, లక్ష్మీనారాయణ, అన్నపూర్ణ, కృష్ణ, ధనరాజ్ ఉన్నారు.