మల్కాజిగిరి, జూలై 24: శ్రీశైలం దర్శానానికి బయలు దేరి ప్రమాదవశాత్తు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శుక్ర వారం మరణించిన మల్కాజిగిరికి చెందిన యరసూరి సుబ్బ లక్ష్మి కుటుంబాన్ని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మం తరావు, కార్పొరేటర్ ప్రేంకుమార్, జితేంద్రనాద్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, టీఆర్ఎస్ సర్కిల్ ప్రధాన కార్యదర్శి జీఎన్వీ సతీశ్కుమార్ శనివారం పరామర్శించారు. నాగర్క ర్నూల్ జిల్లా చెన్నారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్కాజిగిరి నుంచి దర్శానానికి వెళ్లిన సుబ్బలక్ష్మి (61) ఆమె కుమారుడు శివకుమార్ (30)తో పాటు వీరి దూరపు బంధువు తునికి చెందిన రాంమ్మూర్తి (45), ఆయన కుమా రుడు లవమూర్తి అలియాస్ శివ (14) లు సైతం దుర్మరణం చెందిన విషయం విదితమే.
తన తమ్ముడు శివకుమార్కు పెండ్లి సంబంధాలు కుదు రాలని మల్లన్న దర్శనానికి వెళ్లిన తల్లి సుబ్బలక్ష్మి కూడా ప్ర మాదంలో మరణించడం తమ కుటుంబ సభ్యులను తీవ్రం గా కలిచివేసిందని శివకుమార్ సోదరి జ్యోతి తెలిపారు. 17 సంవత్సరాల క్రితం తమ స్వగ్రామం అమలాపురం రావుల పాలెం వీడి బోయినపల్లిలో ఉంటు న్నామని తెలిపింది. కాగా శనివారం సాయంత్రం మల్కాజి గిరి సర్ధార్పటేల్నగర్లోని హిందూ శ్మశానవాటికలో సుబ్బలక్ష్మి, శివకుమారుల అంత్యక్రియలు నిర్వహించారు