నేరేడ్మెట్, జూలై 17 : విపత్కర పరిస్థితుల్లో సాటివారికి అండగా ఉండాలనే సంకల్పంతో నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం యాప్రాల్ పరిధిలోని శాంతినగర్ కంఫర్ట్ మినిస్ట్రీస్ ఫౌండర్ అధ్యక్షుడు నందకుమార్ సహుమ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు, కొవిడ్ బాధితులకు సుమారు 100 మందికి నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్చం ధ సంస్థలు ఆపత్కాలంలో పేదలను ఆదుకోవడానికి మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పాస్టర్లు సైమాన్, దినకరన్, ఆనంద్, శ్యాం, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, సర్కిల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి, అంజయ్య, జీవగన్, కరంచంద్, చిత్రగోకుల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.