వినాయక్నగర్/ఉస్మానియా యూనివర్సిటీ/ మల్కాజిగిరి, జూలై 15: వరద ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. గురువారం వినాయక్నగర్ డివిజన్లోని శివానగర్బస్తీలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మితో కలిసి పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్, విద్యుత్ స్తంభాల తరలింపు, బాక్స్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ ఓపెన్ నాలాల వద్ద ప్రమాదాలు జరుగకుండా జాలి ఏర్పాటు చేస్తామన్నారు. వానకాలంలో వరద ముంపు రాకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పరశురాంరెడ్డి, శ్రీనివాస్, సతీశ్కుమార్, గుండ నిరంజన్, డివిజన్ అధ్యక్షుడు ఓంప్రకాశ్, కార్యదర్శి మణిరత్న, శ్రీకాంత్, భాస్కర్, సంతోష్, సాయి, రాంప్రసాద్ పాల్గొన్నారు.
తార్నాక డివిజన్లో ఉన్న నాలాలను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత గురువారం పరిశీలించారు. బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నాలాలో నీటి ఉధృతి ఎక్కువ కావడంతో పాటు సమీపంలోని సత్యానగర్ కాలనీలో నాలా నీరు రోడ్డు మీదకు వచ్చిన విషయం తెలుసుకున్న టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డితో కలిసి ఆమె ఆ ప్రాంతంలో పర్యటించి సమస్యను పరిష్కరించారు.
తార్నాక డివిజన్లోని నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) తదితర ప్రాంతాల్లో రోడ్లపై నిలిచి ఉన్న వర్షపు నీటిని సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మోహన్రెడ్డి జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి ఆ నీటిని తొలగింపజేశారు.
నగరంలో కురిసిన భారీ వర్షానికి మల్కాజిగిరి సర్కిల్ ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లోని షిర్టీనగర్, సత్తిరెడ్డి కాలనీలో రోడ్లన్నీ జలమయం కావడంతో స్థానిక కార్పొరేటర్ వై. ప్రేంకుమార్ అధికారులతో కలిసి పేదలకు పాల పాకెట్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. సహాయక చర్యల్లో తాసీల్దార్ వినయలత, జీహెచ్ఎంసీ ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, వర్క్ఇన్స్పెక్టర్ రజనీకాంత్ , స్థానికులు పాల్గొన్నారు.