వినాయక్నగర్, జూలై 14: కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం వినాయక్నగర్ డివిజన్లోని టెలికాం కాలనీలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే, కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. అధికారులతో కాలనీల్లో సర్వే నిర్వహించి అవసరమైన కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మీనా, పరుశురాంరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఓంప్రకాశ్, కార్యదర్శి మణిరత్న, శ్రీనివాస్, సతీశ్కుమార్, గుండ నిరంజన్, చెన్నారెడ్డి, శ్రీకాంత్, భాస్కర్, సంతోష్, సాయి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.