వినాయక్నగర్/నేరేడ్మెట్/గౌతంనగర్/ మల్కాజిగిరి, జూలై 10: హరితహారంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మచ్చ బొల్లారం డివిజన్లో పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.అనంతరం దోమల నిర్మూలనపై అవగాహన కల్పించారు. అల్వాల్ డివిజన్లోని చిన్నరాయుడు చెరువులో డ్రోన్తో దోమల నిర్మూలన కోసం రసాయనాల పిచికారీ, సాయినగర్లో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ పరిశీలించారు. వెంకటాపురం డివిజన్ అంబేద్కర్నగర్లో కార్పొరేటర్ సబితాకిశోర్ మొక్కలు నాటి, రోడ్డు పక్కలో ఉన్న మట్టిని తొలిగించారు. వినాయక్నగర్ డివిజన్లోని శివానగర్లో నాలాలో పూడికతీత పనులను కార్పొరేటర్ క్యాన ం రాజ్యలక్ష్మి పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అనిల్కిశోర్, సురేందర్రెడ్డి, కొండల్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
నేరేడ్మెట్ డివిజన్లో ఉన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ మీనా ఉపేందర్రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా యాప్రాల్ భూపేష్నగర్లో చేపట్టిన పనులను అధికారులు, స్థానికులతో కలిసి శనివారం పరిశీలించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం హనుమాన్పేట్, జ్యోతినగర్లో కార్పొరేటర్ మేకల సునీతా రాముయాదవ్, అధికారులు కలిసి పర్యటించారు. పర్యటనలో మన్నారు.
‘పట్టణ ప్రగతి’లో భాగంగా శనివారం మల్కాజిగిరి కార్పొరేటర్ ఊరపల్లి శ్రావణ్కుమార్ విష్ణుపురి కాలనీలో అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను తొలిగించి పరిసరాలను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో ఏఈ దీపక్, ఎంటమాలజీ విభాగం సుభద్ర, వాటర్వర్క్స్ మేనేజర్ సతీశ్, కాలనీ వాసులు పర్వత వర్థిని, శాస్త్రి, శ్రీనివాస్ పాల్గొన్నారు.