నేరేడ్మెట్, జూన్ 12 : కరోనా సంక్షోభ సమయంలోనూ అభివృద్ధి పనుల ఎక్కడా ఆగకుండా పూర్తి చేస్తున్నామని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్లోని ఆండాల్హోమ్స్, కల్యాణిగార్డెన్స్లో స్థానిక కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్రెడ్డితో కలిసి రూ.2.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న యూజీడీ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. డివిజన్లలో దశలవారీగా సమస్యలు పరిష్కరించి నియోజకవర్గాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
బాక్స్ కల్వర్టుల నిర్మాణం ద్వారా వరద నీటి సమస్యలు తీరుతాయన్నారు. కాలనీల్లో వరదనీరు నిల్వకుండా, రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈ సృజన, నాయకులు మల్కాజిగిరి సర్కిల్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి ఉపేందర్రెడ్డి, మోటె సాయికుమార్, దార శ్రీనివాస్రెడ్డి, చెన్నారెడ్డి, జీవగన్, చిత్ర గోకుల్, చిందం శ్రీనివాస్, సాయి, టిక్కం, రాజు తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ పరిధిలోని డిఫెన్స్కాలనీ పార్కులో ఎమ్మె ల్యే ఓపెన్జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ప్రజా ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నిమ్మగడ్డ విజయసారథి, సెక్రటరీ శివయ్య, నిరంజన్, రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.