గౌతంనగర్, జూన్ 2: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వరద ముంపు నివారణ చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం గౌతంనగర్ డివిజన్ ఉత్తంనగర్లో రూ.50లక్షల నిధులతో భూగర్భ బాక్స్ డ్రైన్ పనులకు ఎమ్మెల్యేతో కలిసి కార్పొరేటర్ మేకల సునీతరాముయాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ వరద ముంపు నివారణలో భాగంగా బాక్స్ డ్రైన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలోపే పనులు పూర్తి అవుతాయని అన్నారు. ఏండ్ల నుంచి పూడ్చుకపోయిన నాలాలను గుర్తించి మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు.వరద ముంపు ప్రాంతాల ప్రజలను రక్షించేందుకే విస్తరణ చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ దీపక్, కార్పొరేటర్ ప్రేమ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్ పాల్గొన్నారు.
వినాయక్నగర్, జూన్ 5: వరదముంపు తలెత్తకుండా నాలాకు జాలీని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం మచ్చ బొల్లారం డివిజన్ రుక్మిణి కాలనీ రోడ్డులోని నాలాకు రూ.20లక్షలతో జాలీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొత్త బస్తీలోని నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వచ్చిన వరదల వల్ల స్థానికులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, ఈఈ రాజు, డీఈ మహేశ్, ఏఈ రవళి, రవికాంత్, సురేందర్రెడ్డి, శ్రీశైలం, శ్రీనివాస్గౌడ్, భగిరథాచారి, మధుసూదన్, లక్ష్మణ్యాదవ్ పాల్గొన్నారు.