గౌతంనగర్, మార్చి 14 : జర్నలిస్టులకు అండగా ఉంటానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు జారిపడి మోకాలికి గాయమై నడవలేని స్థితిలో ఉన్న విలేకరి అబ్దుల్ రెహమాన్ను మౌలాలి శ్రామికనగర్లో ఆయన వివాసంలో రెహమాన్ను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పరామర్శించారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలపై చర్చించారు. ప్రభుత్వ పరంగా అందే లబ్ధికాకుండా తన వ్యక్తి గత సహాయాన్ని అందిస్తామని తెలిపారు. ఆపదలో ఉన్న జర్నలిస్టులకు వైద్య ఖర్చులు, పిల్లల చదువులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే తన సొంతంగా రూ.25వేల ఆర్థిక సహాయాన్ని రెహమాన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జీఎన్వీ సతీశ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఇబ్రహీం, జర్నలిస్టులు బాల్రాజు, వెంకటేశ్వరరావు, నాయుడు, లక్ష్మారెడ్డి, సుబ్బారావు, రాజుగౌడ్, కృష్ణమూర్తి, దాస్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.